అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి 2024కు గాను బెస్ట్ ఉమెన్స్ టీ20 టీమ్ను ప్రకటించింది. ఐసీసీ ప్రకటించిన ఈ జట్టులో ముగ్గురు భారత ప్లేయర్లకు చోటు దక్కింది. భారత ఉమెన్స్ టీమ్ విధ్వంసకర ఓపెనర్ బ్యాట్స్ మెన్ స్మృతి మంధాన, వికెట్ కీపర్ రిచా ఘోష్, ఆల్ రౌండర్ దీప్తి శర్మ చోటు దక్కించుకున్నారు. అలాగే ఉమెన్స్ టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్ 2024 కెప్టెన్గా లారా వోల్వార్డ్ను ఎంపిక చేసింది.