ఏపీలో కండరాలు తినేసే అరుదైన వ్యాధి గుర్తింపు

54చూసినవారు
ఏపీలో కండరాలు తినేసే అరుదైన వ్యాధి గుర్తింపు
ఏపీలో 'నెక్రోటైజింగ్‌ ఫాసియైటిస్‌' అనే అత్యంత అరుదైన వ్యాధి బయటపడింది. నెక్రోటైజింగ్‌ ఫాసియైటిస్‌ జబ్బుకు మరో పేరు ఫ్లెష్‌ ఈటింగ్‌ డిసీజ్‌. ఈ బాక్టీరియా సోకడం వల్ల శరీర భాగాల్లోని మృదు కణజాలాలు చనిపోతాయి. ఈ ప్రమాదకర బాక్టీరియా కండరాలను తినేస్తుంది. దాంతో ఆ భాగాలు కుళ్లిపోతాయి. చివరికి వాటిని తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సాధారణంగా మధుమేహ రోగుల్లో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది.
Job Suitcase

Jobs near you