చనిపోయిందనుకుని భావించి ఓ మహిళను పూడ్చిపెట్టిగా ఆమె తిరిగి లేచి కూర్చుని నవ్విన ఘటన అమెరికాలో జరిగింది. 1915లో ఎస్సీ విలియమ్స్ అనే మహిళ మూర్ఛ వ్యాధితో చనిపోగా ఆమెకు అంత్యక్రియలు కూడా పూర్తిచేశారు. అయితే ఆలస్యంగా వచ్చిన తన సోదరి విలియమ్స్ను చివరి చూపు చూస్తాననడంతో సమాధిని తవ్వి శవపేటికను తెరవగా ఆమె లేచి కూర్చుని నవ్వుతూ కనిపించారు. అది చూసిన వారంతా భయంతో పరుగులు తీశారు. ఆ తర్వాత ఆమె మరో 47ఏళ్లు జీవించారు.