ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత సైన్యం చర్యలను సమర్థిస్తూ కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ పాకిస్థాన్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. భారత్ ఉద్రిక్తతను పెంచాలనే ఉద్దేశంతో కాకుండా కేవలం ప్రతిస్పందనగానే ఈ చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన స్పష్టం చేశారు. "పాకిస్థాన్ పౌరులు సరిహద్దు దాటి భారత్లోకి రాలేరు. ఒకవేళ వస్తే దానికి మూల్యం చెల్లించకుండా సురక్షితంగా తిరిగి వెళ్లలేరు" అని థరూర్ వ్యాఖ్యానించారు.