TG: హైదరాబాద్లో ఇసుక అక్రమ రవాణా, ఇసుక నిల్వలు, విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి. కేటుగాళ్లు ఇసుక రీచ్ల నుంచి 10,000 రూపాయలకు ఒక లారీ ఇసుకను కొనుగోలు చేసి.. హైదరాబాద్లో 50,000 రూపాయలకు విక్రయిస్తున్నారు.
ఇసుక అక్రమ డంపింగ్కి పాల్పడుతున్న వ్యక్తులను గుర్తించి, టాస్క్ ఫోర్స్ అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. అక్రమంగా ఇసుక అమ్మే వారిపై చర్యలు తీసుకుంటామని టాస్క్ ఫోర్స్ అధికారులు స్పష్టం చేశారు.