మాంద్యంలో చిక్కుకుపోతున్న పాకిస్తాన్కు భారీ ఊరట దక్కింది. పాక్కు 1 బిలియన్ యూఎస్ డాలర్ల రుణాన్ని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (IMF) అందజేసింది. IMF తమకు 1 బిలియన్ బెయిలౌట్ ప్యాకేజీని ఆమోదించిందని పాకిస్తాన్ తాజాగా ప్రకటించింది. అయితే పాక్కు రుణం ఇస్తే ఆ దేశం ఉగ్రవాదులను పెంచి పోషించడానికి వినియోగిస్తుందని భారత్ వాదించింది.