తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణయం

81చూసినవారు
తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణయం
భారీ వ‌ర్షాల‌తో న‌ష్ట‌పోయిన వారికి తెలంగాణ ప్ర‌భుత్వం ఆదుకునే ప్ర‌య‌త్నం చేస్తుంది. ఈ క్ర‌మంలోనే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కూలిపోయిన, దెబ్బతిన్న వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామ‌న్నారు. అంతేకాకుండా న‌ష్ట‌పోయిన ప్రతి కుటుంబానికి రూ.16,500 ఆర్థిక సహాయం చేయ‌నున్న‌ట్లు తెలిపారు. మృతుల కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లుతో పాటు రూ. 5 లక్షల సహాయం చేయ‌నున్నారు. వరద ముప్పుకు గురైన ప్రతి ఎకరానికి రూ. 10 వేల ఆర్థిక సహాయం చేయ‌నున్న‌ట్లు మంత్రి తెలిపారు.

సంబంధిత పోస్ట్