TG: హైదరాబాద్లోని దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ హాజరయ్యారు. వివిధ విభాగాల్లో ప్రీ-కమిషనింగ్ శిక్షణ పూర్తిచేసిన ఫ్లైట్ క్యాడెట్లు పరేడ్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన విమానాల విన్యాసాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.