బీహార్లోని ముజఫర్పూర్ జిల్లాలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. దివ్య అనే మహిళ తనను అత్తమామలు వేధిస్తున్నట్లు బోచాహా పోలీస్ స్టేషన్ను ఆశ్రయించింది. తాను 2021లో వివాహం చేసుకున్నానని, మొదట్లో అంతా సజావుగా సాగినా తరువాత అత్తమామలు తనను హింసించడం ప్రారంభించారని పేర్కొంది. తన తల్లిదండ్రుల ఇంటి నుండి నగదు తీసుకు రావాలని, తన కిడ్నీలలో ఒకదాన్ని ఇవ్వాలంటున్నారని వాపోయింది.