కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యేక పోక్సో కోర్టుల సంఖ్యను పెంచాలని ఆదేశించింది. ప్రత్యేక కోర్టులు లేకపోవడం వల్ల కేసుల విచారణ ఆలస్యం అవుతుందని న్యాయమూర్తులు బేలా ఎం త్రివేది మరియు పీబీ వరలేలలతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు పోక్సో కేసుల దర్యాప్తుతో సంబంధం ఉన్న అధికారులను అప్రమత్తం చేయడానికి చర్యలు తీసుకోవాలని సూచించింది.