నాగ్పూర్ వేదికగా గురువారం భారత్-ఇంగ్లాండ్ మధ్య తొలి ODI జరగనుంది. మధ్యాహ్నం 1.30కు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ పిచ్ బ్యాటింగ్కు పూర్తి అనుకూలం. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు సులువుగా 300-350 పరుగులు దాటొచ్చు. పిచ్పై పెద్దగా పచ్చిక లేని నేపథ్యంలో స్పిన్నర్ల ప్రభావం బాగానే ఉంటుంది. టీ20ల్లో చూపిన జోరును వన్డేల్లోనూ కొనసాగించాలని IND ఉవ్విళ్లూరుతోంది. అటు వన్డేల్లో బోణీ కొట్టాలని ENG ఆరాటపడుతోంది.