ఉగ్రవాదానికి మద్దతిచ్చే పాకిస్థాన్కు ఆర్థిక సాయం చేయొద్దని భారత్ IMFను కోరింది. అలాంటి దేశానికి రుణం ఇవ్వడం ప్రమాదకరమని భారత్ స్పష్టం చేసింది. అదనపు రుణాల కోసం పాక్ IMFను ఆశ్రయించగా, ఈ అంశంపై ఇవాళ జరిగే కార్యనిర్వాహక బోర్డు సమావేశంలో చర్చించనున్నారు. ఈ భేటీలో భారత ప్రతినిధి పాక్కు సాయం ఇవ్వకుండా అభ్యంతరం చెప్పనున్నారు.