ఇజ్రాయెల్తో ఉద్రిక్తతల మధ్య, తమ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరఘ్చి, భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ మధ్య జరిగిన సంభాషణకు సంబంధించి ఇరాన్ ప్రకటన విడుదల చేసింది. "ఇరాన్పై ఇజ్రాయెల్ దాడుల్లో అమాయక ప్రజలు మరణించడం పట్ల జైశంకర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు" అని పేర్కొంది. ఇజ్రాయెల్ దాడులను భారత్ ఖండించడాన్ని అరఘ్చి అభినందించారని పేర్కొంది.