అమెరికాలోని భారత రాయబారి వినయ్ క్వాత్ర మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించటమే భారత్ లక్ష్యమని అన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదులకు మద్దతు ఇస్తోందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భారత్ ఉగ్రవాదులతో యుద్ధం చేస్తోందని, పాక్తో కాదని తెలిపారు. ఇందులో పౌరులు, సైనిక స్థావరాలు, ఆదాయ వనరులను నాశనం చేయడం తమ ఉద్దేశం కాదన్నారు. కానీ పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.