పాక్ ఆర్మీ కుట్రలను భారత్ సమర్ధవంతంగా తిప్పికొడుతోంది. సరిహద్దుల్లో పాక్ ఆర్మీ కాల్పులు జరుపుతూనే భారత్లోకి చొరబడేందుకు ఉగ్రవాదులకు సహకరిస్తోంది. ఓ వైపు పాక్ ఆర్మీ కాల్పులు జరుపుతుంటే మరోవైపు ఉగ్రవాదులు భారత్లోకి చొరబడేందుకు యత్నిస్తున్నారు. ఈ క్రమంలో సరిహద్దుల్లోని భారత జవాన్లు ఉగ్రవాదులను హతమారుస్తున్నారు. సాంబా సెక్టార్లో BSF జవాన్లు ఏడుగురు ఉగ్రవాదులను హతమార్చిన సంగతి తెలిసిందే.