పహల్గాం దాడులకు ప్రతిస్పందనగా ఇటీవల భారత్ సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసి, పలు డ్యామ్లను మూసేసిన సంగతి తెలిసిందే. తాజాగా జమ్మూకశ్మీర్లోని రాంబన్ జిల్లాలో భారీ వర్షం కురియడంతో ఆ ప్రాంతంలో వరదలు ముంచెత్తాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు చీనాబ్ నదిపై ఉన్న బాగ్లిహర్, సలాల్ డ్యామ్ గేట్లను ఎత్తేశారు. వరద ఉధృతి తగ్గించేందుకు అధికారులు సలాల్ డ్యామ్ 3 గేట్లను ఓపెన్ చేశారు.