ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఆడబోయే మ్యాచ్ల టికెట్లను ఐసీసీ సోమవారం రిలీజ్ చేసింది. ఫిబ్రవరి 23న భారత్, పాక్ పోరు జరగనుంది. దుబాయ్లో వేదికగా జరిగే టీమిండియా మ్యాచ్ల టికెట్లను ఐసీసీ అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే, జనరల్ స్టాండ్ టికెట్లు మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. టికెట్ల ధర దాదాపు రూ.3 వేల నుంచి మొదలుకానుంది. ప్రీమియర్, వీఐపీ స్టాండ్ల టికెట్స్ను రిలీజ్ చేయాల్సి ఉంది.