భారత్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో బ్యాంకులు చాలా అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. వినియోగదారులకు, వ్యాపారాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది కలగకుండా చూడాలని, అంతరాయం లేని సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు. సవాళ్లతో కూడిన సమయంలో ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధరించడంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల పాత్ర కీలకమని ఆమె తెలిపారు.