భారత్-పాక్ యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. 'ఆపరేషన్ సిందూర్' పేరుతో పాకిస్థాన్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం దాడులు చేసింది. దీంతో భద్రతా బలగాలు, పోలీసులు అప్రమత్తమయ్యాయి. ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్లో హై అలర్ట్, ఉత్తర్ప్రదేశ్లో రెడ్ అలర్ట్ జారీ అయింది. యూపీ డీజీపీ పోలీసులకు రక్షణ శాఖతో సమన్వయంతో భద్రత కల్పించాలని ఆదేశించారు.