భారత్–పాక్ వార్.. ఏయూలో హాస్టల్స్ క్లోజ్!

65చూసినవారు
భారత్–పాక్ వార్.. ఏయూలో హాస్టల్స్ క్లోజ్!
భారత్‌-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం కీలక నిర్ణయం తీసుకుంది. శనివారం నుంచి హాస్టళ్లు తాత్కాలికంగా మూసివేశారు. విద్యార్థుల భద్రతను కూడా దృష్టిలో పెట్టుకుని పరీక్షలు అయిపోయిన వెంటనే వెళ్లిపోవాలని యూనివర్సిటీ రిజిస్ట్రార్ తెలిపింది. అలాగే హాస్టళ్లలో మరమ్మత్తులు కూడా చేపడుతున్నామని, ఎండకాలం కావడంతో నీటి ఎద్దడిని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్