భారత మహిళల అండర్-19 జట్టు మరో ఘన విజయాన్ని అందుకుంది. మలేషియాలో జరుగుతున్న మహిళల అండర్-19 టీ20 వరల్డ్ కప్ గ్రూపు దశను అజేయంగా ముగించింది. గురువారం చివరి గ్రూపు మ్యాచ్లో శ్రీలంకను ఓడించి హ్యాట్రిక్ విక్టరీని నమోదు చేసింది. ముందుగా భారత్ నిర్ణీత 118 స్కోరు చేయగా, ఆ తర్వాత ఛేదనలో శ్రీలంక 58/9 స్కోరుకే పరిమితమైంది. ఇక, ఈ విజయంతో భారత్ సూపర్-6 రౌండ్కి అర్హత సాధించింది. ఆదివారం మలేసియాతో తలపడనుంది.