పాక్ ఆర్మీ కాల్పులకు భారత సైన్యం కఠిన ప్రతీకారం తీసుకుంటోంది. LOC వద్ద పాక్ శిబిరంపై భారత్ జరిపిన ప్రతిదాడిలో అది పూర్తిగా ధ్వంసమైంది. ఇందుకు సంబంధించిన వీడియోను భారత ఆర్మీ అధికారికంగా విడుదల చేసింది. ఈ దాడిలో RPG లేదా ATGM తరహా ఆయుధాలను ఉపయోగించినట్టు కనిపిస్తోంది. గత రెండు రోజులుగా పాక్ కాల్పుల్లో 17 మంది భారత పౌరులు ప్రాణాలు కోల్పోగా, 50 మందికిపైగా గాయపడ్డారు.