భారత్, ఇంగ్లాండ్ మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో కీలక పోరుకు వేళైంది. ఇవాళ ఇరు జట్ల మధ్య బారాబతి స్టేడియం వేదికంగా రెండో వన్డే జరుగనుంది. మోకాలి నొప్పితో తొలి వన్డేకు దూరమైన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పూర్తి ఫిట్నెస్ సాధించడం టీమ్ మేనేజ్మెంట్కు మంచి ఊరట లభించింది. శనివారం జరిగిన ఆప్షనల్ ప్రాక్టీస్ సెషనల్ కోహ్లీ ఎలాంటి ఇబ్బంది లేకుండా గడిపారని బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ పేర్కొన్నాడు.