జమ్మూకశ్మీర్లో కాల్పుల మోత మళ్లీ మొదలైంది. పాకిస్తాన్ డ్రోన్లతో దాడికి ప్రయత్నిస్తోంది. అప్రమత్తమైన భారత్ సైన్యం పాక్ డ్రోన్ను పేల్చేసింది. ఇక జమ్మూలో పేలుళ్ల శబ్దాలు వినిపిస్తున్నాయని సీఎం ఒమర్ అబ్దుల్లా సైతం వెల్లడించారు. దీంతో పలు ప్రాంతాల్లో సైరన్లు మోగాయి. అయితే గురువారం రాత్రి కూడా పాక్ ఇలాంటి దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే.