రాజస్థాన్లో పట్టుబడిన అక్రమ బంగ్లాదేశ్ పౌరులలో మొదటి బ్యాచ్ను అధికారులు జోధ్పూర్కు తరలించారు. ఇటీవల భారతదేశంలో అక్రమంగా ఉన్నారని గుర్తించబడిన ఈ బంగ్లాదేశీయులను అధికారులు పట్టుకున్నారు. ప్రస్తుతం వీరిని బంగ్లాదేశ్కు తిరిగి పంపేందుకు (డిపోర్ట్) చర్యలు చేపట్టినట్లు సమాచారం. కాగా, పహల్గాం ఉగ్రదాడి తరువాత భారత్లో ఉన్న పాకిస్థానీయులను భారత ప్రభుత్వం వెనక్కి పంపిన సంగతి తెలిసిందే.