అండర్సన్-టెండూల్కర్ సిరీస్లో భాగంగా బర్మింగ్హామ్లో ఇంగ్లండ్తో జరిగిన రెండో టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్లో ఆతిథ్య జట్టు 271కి ఆలౌట్ కావడంతో భారత్ 336 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలి ఇన్నింగ్స్లో భారత్ 587, ఇంగ్లాండ్ 407 పరుగులు చేశాయి. రెండో ఇన్సింగ్స్లో భారత్ 427/6 వద్ద డిక్లేర్ చేయగా.. 608 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ 271 పరుగులకే పరిమితమైంది. ఆకాశ్ దీప్ 6 వికెట్లు తీసి అదరగొట్టారు.