జమ్మూకశ్మీర్, పంజాబ్లోని పలు ప్రాంతాల్లో పాకిస్థాన్ చేసిన డ్రోన్ల దాడులను భారత ఆర్మీ ధీటుగా తిప్పికొట్టింది. ఈ మేరకు ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లను భారత సైన్యం ధ్వంసం చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఇండియన్ ఆర్మీ తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేసింది. 'పౌరులపై దాడులకు పాల్పడుతున్న పాక్ ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్ ను ధ్వంసం చేశాం. దీంతో వారి మౌలిక సదుపాయాలు, సామర్థ్యాలకు భారీ దెబ్బ తగిలింది' అని తెలిపింది.