TG: 2.10 లక్షల మంది రైతుల అధీనంలోని 6 లక్షల ఎకరాల భూములకు విద్యుత్తు సౌకర్యం లేదు. వీటికి పూర్తి రాయితీతో సోలార్ పంపుసెట్లు ఏర్పాటుచేసి, నీటివసతి కల్పిస్తారు. రైతుకు రెండున్నర ఎకరాల కన్నా ఎక్కువ భూమి ఉంటే సింగిల్ యూనిట్గా పరిగణిస్తారు. అంతకు తక్కువుంటే పక్కనే ఉండే 2-5 మంది రైతులతో బోర్వెల్ యూజర్ గ్రూపుగా ఏర్పాటు చేస్తారు. జిల్లాస్థాయిలో పథకం అమలు, కొనుగోళ్ల కమిటీకి కలెక్టర్ ఛైర్మన్గా ఉంటారు.