TG: రాష్ట్రంలో గిరిజనుల కోసం ఇందిరా సౌరగిరి జలవికాస పథకం ప్రారంభిస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. నాగర్కర్నూల్(D) మన్ననూరులో సీఎం రేవంత్ ఈ నెల 18న ఈ పథకాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. 'గిరిజనులకు ఆర్వోఎఫ్ఆర్ చట్టం కింద కేటాయించిన భూములను పూర్తిస్థాయిలో సాగులోకి తీసుకురావాలి. రూ.12,600 కోట్లతో ఈ పథకాన్ని చేపడుతున్నాం. వచ్చే ఐదేళ్లలో 2.10 లక్షల మంది రైతులకు 6 లక్షల ఎకరాల్లో సాగునీటిని అందిచవచ్చు' అని అన్నారు.