యూపీలోని లిఖింపూర్లో దారుణ ఘటన వెలుగుచూసింది. ఓ దుకాణదారుడిని రౌడీ మూకలు కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. దుకాణానికి వచ్చిన ముగ్గురు దుండగులు పెద్ద పెద్ద కర్రలతో అతడిపై విరుచుకుపడ్డారు. ముగ్గురు చుట్టుముట్టి కొట్టడంతో దుకాణాదారుడు నిమ్మకుండిపోయాడు. దాడి దృశ్యాలు సీసీ ఫుటేజీలో రికార్డు కాగా వైరల్గా మారాయి.