దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఆదివారం జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్లో భారత్ టాస్ ఓడిన సంగతి తెలిసిందే. అయితే ఈ పిచ్ చాలా పొడిగా కనిపిస్తోందని మాజీ క్రికెటర్స్ రమీజ్ రాజా మరియు ఆరోన్ ఫించ్ తమ రిపోర్టులో పేర్కొన్నారు. వర్షం పడే అవకాశం చాలా తక్కువగా ఉన్నాయని వారు తెలిపారు. ఈ పిచ్ ఫస్ట్ బ్యాటింగ్కే అనుకూలమని వారు చెప్పారు. రెండవ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయడం కష్టతరం అవుతుందని.. తేమకు అవకాశం లేదని తెలిపారు.