లోక్సభలో BRS ఎంపీలు లేకపోవడంతో తెలంగాణకు అన్యాయం జరుగుతోందిని ఆ పార్టీ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు ప్రజల ఆకాంక్షలు ప్రతిఫలించేలా ఉండాలని ఆయన అన్నారు. ఇందులో భాగంగా ఏప్రిల్ 27న లక్షలాది మందితో వరంగల్లో బహిరంగసభ నిర్వహించనున్నట్లు చెప్పారు. శుక్రవారం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో పార్టీ నేతలతో కేసీఆర్ చర్చలు జరిపారు. పలు కీలక అంశాలపై వారితో సుదీర్ఘంగా చర్చించారు.