TG: రాష్ట్ర కేబినెట్ లో చోటు దక్కకపోవడంపై మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఉమ్మడి ఆదిలాబాద్ కు మరోసారి అన్యాయం జరిగిందని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో జిల్లాది కీలక పాత్ర అని చెప్పారు. అధిష్ఠానం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లగా, త్వరలోనే న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. అప్పటివరకు కార్యకర్తలు సంయమనం పాటించాలని సూచించారు.