ఐపీఎల్ 2025లో భాగంగా వాంఖడే వేదికగా గురువారం ముంబై ఇండియన్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. రాత్రి 7 గంటలకు టాస్ పడనుంది. అనంతరం మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు మొదలవ్వనుంది. ముంబై పిచ్ ఛేజింగ్కు అనుకూలంగా ఉంటుంది. టాస్ గెలిచి ఫస్ట్ బౌలింగ్ తీసుకునే జట్టుకు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ పిచ్ సాధారణంగా బౌలర్ల కంటే బ్యాటర్లకే అనుకూలంగా ఉంటుంది. MIకు హోమ్ గ్రౌండ్ అనుకూలత కలిసి వచ్చే అంశం.