భారత్-పాక్ల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ 2025 నిరవధికంగా వాయిదా పడింది. విదేశీ ఆటగాళ్లు, ముఖ్యంగా ఆస్ట్రేలియా ఆటగాళ్లు భయాందోళనతో స్వదేశానికి వెళ్లాలని బీసీసీఐకి తెలిపారు. మ్యాచ్ల నిర్వహణ, ప్రేక్షకుల భద్రత సవాళ్లుగా మారడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఇది ఐపీఎల్ అర్థంతరంగా వాయిదా పడిన రెండో సందర్భం. గతంలో కోవిడ్ కారణంగా 2021లో వాయిదా పడి, పరిస్థితులు మెరుగైన తర్వాత పునఃప్రారంభమైంది.