ఐపీఎల్ 2025 నిరవధికంగా వాయిదా పడింది. భారత్-పాక్ ఉద్రిక్తతల కారణంగా బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ధర్మశాలలో జరగాల్సిన ఢిల్లీ క్యాపిటల్స్-పంజాబ్ కింగ్స్ మ్యాచ్ (58వది) రద్దయింది. మొత్తం 74 మ్యాచ్లలో ఇంకా 16 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. అయితే మిగిలిన మ్యాచ్ల షెడ్యూల్, వేదికలపై స్పష్టత మాత్రం రాలేదు. పహల్గ్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ఆపరేషన్ సిందూర్ ప్రారంభించింది, అప్పటి నుంచి ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.