రాజస్థాన్ రాయల్స్తో జరుగుతున్న మ్యాచులో ఢిల్లీ ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసి రాజస్థాన్ ముందు 189 రన్స్ టార్గెట్ ఉంచింది. ఢిల్లీ బ్యాటర్లలో అభిషేక్ పోరెల్ (49), రాహుల్ (38) పరుగులు చేశారు. చివర్లో స్టబ్స్ (32*) మెరుపులు మెరిపించాడు. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 2 వికెట్లు తీశాడు.