భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తల కారణంగా ఐపీఎల్ 2025 సీజన్లో మిగిలిన మ్యాచ్లు వారంపాటు వాయిదాపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అభిమానులకు టికెట్ల డబ్బులను ఫ్రాంఛైజీలు తిరిగి చెల్లిస్తున్నాయి. షెడ్యూలు ప్రకారం మే 10న ఉప్పల్ వేదికగా SRH, KKR మధ్య జరగాల్సిన మ్యాచ్ కూడా BCCI నిర్ణయం మేరకు వాయిదా పడింది. ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న అభిమానులకు సన్రైజర్స్ యాజమాన్యం డబ్బులను రీఫండ్ చేసింది.