ఇరాన్ ఇజ్రాయెల్ దాడులను తీవ్రంగా ఖండించింది. ఇజ్రాయెల్కు ప్రతీకారంగా దీటుగా స్పందిస్తామని ఇరాన్ సైనిక ప్రతినిధి అబొల్ఫజల్ షెక్రాచి హెచ్చరించారు. రక్షణ మంత్రి అజీజ్ నసీర్జాదా అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేస్తామని అన్నారు. ఇరాన్ తమ అణు కార్యక్రమం శాంతియుతమైన పౌర అవసరాల కోసమేనని, ఇజ్రాయెల్ దాడులు అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించాయని ఆరోపించింది.