ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రతిదాడులకు దిగింది. వంద డ్రోన్లతో విరుచుకుపడింది. ఇరాన్ డ్రోన్లను ఇజ్రాయెల్ సైన్యం తిప్పికొడుతుంది. అంతకుముందు ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడుల్లో ఇరాన్ మిలిటరీ చీఫ్ మహమ్మద్ బాఘేరీ, పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్ చీఫ్ మేజర్ జనరల్ హుస్సేన్ సలామీ, ఇతర టాప్ అధికారులు, ఇద్దరు అణు శాస్త్రవేత్తలు మరణించారు. ఇరాన్లోని అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది.