ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఘర్షణల కారణంగా బంగారం ధరలు భారీగా పెరుగనున్నట్లు నిపుణులు అంటున్నారు. యుద్ధ పరిస్థితుల్లో పెట్టుబడిదారులు నష్టం నుంచి రక్షించుకునేందుకు బంగారం వంటి వాటిలో పెట్టుబడి పెడతారు. దీనివల్ల పసిడి ధరలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఇది సాధారణ ప్రజలకు ఆర్థిక భారంగా మారే అవకాశముంది.