TGPSC నిర్వహించిన గ్రూప్-1లో అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని BRS ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రిలిమ్స్, మెయిన్స్కు వేర్వేరు హాల్టికెట్లు ఎందుకిచ్చారని ప్రశ్నించారు. కోఠి కళాశాలలోని 18, 19వ సెంటర్లలో 1,490 మంది పరీక్ష రాస్తే.. 74 మంది ఎంపికయ్యారన్నారు. ఓ కాంగ్రెస్ నేత కోడలికి ఎస్టీ విభాగంలో మొదటి ర్యాంక్ వచ్చిందన్నారు. దీనిపై బీజేపీ ఎందుకు మాట్లాడటం లేదన్నారు.