తెలంగాణలో ధాన్యం కొనుగోలు జరగడం లేదని KTR అన్నారు. ఖమ్మం(D) మిట్టపల్లి గ్రామంలో స్వర్గీయ DCMS మాజీ చైర్మన్ రాయల శేషగిరిరావు విగ్రహాన్ని ఆవిష్కరించి, బహిరంగ సభలో మాట్లాడారు. 'జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు.17 నెలల్లో జిల్లాకు ఏం జరిగిందో ఆలోచన చేయాలి. KCR ప్రజల కోసం సీతారామా ప్రాజెక్ట్ తెస్తే ఆ నీళ్ళు నెత్తిన జల్లుకునారు కానీ ప్రజలకు ఏమి చేయలేదు. మార్పు కావాలని జిల్లా మొత్తం కాంగ్రెస్కి ఓటేశారు. మార్పు బాగుందా?' అని అడిగారు.