ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాలో ఇటీవల జరిగిన తొక్కిసలాటలో 30 మంది భక్తులు మరణించిన విషయం తెలిసిందే. దీనిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఈ తొక్కిసలాటలో కుట్రకోణం ఉండవచ్చని అనుమానిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. తొక్కిసలాట జరిగిన ప్రాంతంలో చురుకుగా ఉన్న 16,000 కంటే ఎక్కువ మొబైల్ నంబర్ డేటాను దర్యాప్తు అధికారులు విశ్లేషిస్తున్నారు.