AP: తిరుపతి గోశాలలో గోవుల మృతిపై TDP - YCP మధ్య సవాళ్ల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. TDP నేతల సవాల్ కు భూమన సిద్ధమయ్యారని, గోశాల వద్దకు అనుమతించే ధైర్యం TDPకి ఉందా అంటూ నిలదీశారు. సవాల్ చేసిన వాళ్లే అడ్డుకోవడం ఎంత వరకు కరెక్ట్ అనిమండిపడ్డారు. తిరుమలలో చాలా అపచారాలు జరుగుతున్నాయని, సనాతన ధర్మం అంటే ఇదేనా పవన్ కళ్యాణ్ అని రోజా ప్రశ్నించారు.