ఇరాన్పై ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ పేరిట ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తున్న వేళ, నిన్న విడుదల చేసిన మ్యాప్లో భారత్ సరిహద్దులను తప్పుగా చూపించడంతో భారత పౌరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తీవ్ర విమర్శల మధ్య ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) తప్పును అంగీకరించి భారత్కు క్షమాపణలు తెలిపింది. విడుదల చేసిన మ్యాప్లో సరిహద్దులను స్పష్టంగా చూపించలేకపోయామని పేర్కొంది.