వరుస దాడులతో ఇజ్రాయెల్ గాజాపై తీవ్రంగా విరుచుకుపడుతోంది. మంగళవారం రాత్రి ఉత్తర గాజాలోని ఇళ్లపై జరిగిన వైమానిక దాడుల్లో 48 మంది పౌరులు మృతి చెందారు. ఇందులో 22 మంది చిన్నారులు ఉన్నట్లు జబాలియాలోని ఆరోగ్యశాఖ వెల్లడించింది. పలు నివాస భవనాలు పూర్తిగా కూలిపోయాయని అధికారులు తెలిపారు. ఈ దాడితో గాజాలో మరింత విషమ పరిస్థితి నెలకొంది.