ఇజ్రాయిల్ చేసిన దాడులకు ఇప్పటికే వేలాది మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. తాజాగా జరిపిన దాడుల వల్ల తమ తల్లిదండ్రులోనో లేదా తోబుట్టువులనో పోగొట్టుకున్న చిన్నారుల ఆర్తనాదాలు మిన్నంటుతున్నాయి. గాజాలో ఆహార పంపిణీ కేంద్రాల వద్ద వేచిఉన్న జనాలపైన, ఆసుపత్రులను లక్ష్యంగా చేసుకున్న ఇజ్రాయిల్ చేసిన దాడులకు 47 మంది పాలస్తీనియన్లు మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.