ఇరాన్పై దాడులకు దిగిన ఇజ్రాయెల్ ఆ దేశ కీలక నేతలను హతమార్చింది. అయితే శుక్రవారం రాత్రి నుంచి ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రతిదాడులు ప్రారంభించింది. టెల్ అవీవ్పై మిస్సైళ్లతో విరుచుకుపడింది. దీంతో ఇద్దరు ఇజ్రాయెల్ పౌరులు చనిపోగా, పలువురు గాయపడ్డారు. తాజాగా ఇజ్రాయెల్ తిరిగి స్ట్రైక్స్ మొదలుపెట్టింది. పశ్చిమ ఇరాన్ లక్ష్యంగా దాడులు చేస్తోంది. అటు ఇరు దేశాలు సంయమనం పాటించాలని యూఎన్ఓ సూచించింది.