TG: పుష్ఫాలగూడ పరిసరాల్లో 450 ఎకరాల్లో ఐటీ నాలెడ్జ్ హబ్ ప్రారంభించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. దీని ద్వారా 5 లక్షల మంది యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. ఈ భూమిని ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐఏఎస్లకు కేటాయించగా.. ఇప్పుడు ఐటీ హబ్ కోసం ఉపయోగిస్తున్నట్లు వెల్లడించారు. ఈ 200 ఏకరాల భూమిని వివిధ సొసైటీలకు కేటాయించగా.. సుప్రీంకోర్టు రద్దు చేసిందని, దాంతో ఇంకో 250 ఎకరాలు కలిపి ఐటీ నాలెడ్జ్ హబ్ను ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు.